Earthquake: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది . ములుగు కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి . రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయింది . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూ ప్రకంపనలతో ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు . రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది . చాలా చోట్ల ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
ఇంటిలో ఉన్నసామాను చెల్లాచెదురుకావడం . . గోడలు బీటలు వారడం కొన్ని చోట్ల జరిగింది. భూకంపం వలన పెద్ద నష్టం జరిగినట్టు వార్తలు లేనప్పటికీ చాలా జిల్లాల్లో భూకంప తీవ్రత ప్రజలను ఆందోళనకు గురిచేసింది .