Ap news: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు వైద్యుల మృతి

Ap news: ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. యక్సిడెంట్ ను గమనించిన. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం తో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీసి వారిని గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగంగా చెట్టును కారు ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మంచు కురవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులలో ఇద్దరు వైద్యులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరందరూ కూడా బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ అని పోలీసులు గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *