BRS: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇతర సీనియర్ నేతలతో కలిసి అధికారికంగా ‘ఛార్జ్షీట్’ను విడుదల చేశారు. 100 రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ వెయ్యి రోజుల్లో రాష్ట్ర ప్రజలకు నరకం చూపించిందని నేతలు మండిపడ్డారు.
దరిద్రం దండయాత్ర చేసి 1000 రోజులైంది – కేటీఆర్ ధ్వజం..
కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యవసాయం, తాగు-సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, శాంతిభద్రతల రంగాలు కాంగ్రెస్ హయాంలో పూర్తిగా కుప్పకూలిపోయాయని హరీశ్రావు మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని నమ్మబలికి, వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వైపు పరుగులు తీయాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు తిరోగమనం వైపు తీసుకెళ్లారని ఆయన విమర్శించారు.
