Vijay:

Vijay: రంగంలోకి దిగిన దళపతి విజయ్.. పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి లేఖ!

Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం కొనసాగుతుండగా, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన ఎన్నికల సంఘానికి (EC) బుధవారం లేఖ రాశారు. చెన్నై సహా పలు జిల్లాల్లో రవాణా సౌకర్యాల లేమిపై ఆయన ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రవాణా కష్టాలపై విజయ్ ఫైర్

తమిళనాడు వ్యాప్తంగా నేడు ఒకే విడతలో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే, ఉదయం నుండి అనేక ప్రాంతాల్లో ఓటర్లకు సరైన రవాణా వసతులు లేవని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పోలింగ్ కేంద్రాలకు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రవాణా సంస్థలు తగినన్ని బస్సులు నడపకపోవడంపై ఆయన మండిపడ్డారు.

ఎమర్జెన్సీ బస్సులు నడపాలని విజ్ఞప్తి

ఓటర్ల కోసం వెంటనే ప్రత్యేక ‘ఎమర్జెన్సీ బస్సులు’ ఏర్పాటు చేయాలని విజయ్ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. “ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనది. రవాణా సౌకర్యాలు లేక ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేరవేసే బాధ్యతను ఎన్నికల యంత్రాంగం వెంటనే తీసుకోవాలని కోరారు.

పోలింగ్ సమయం పొడిగింపు డిమాండ్

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అయితే, రవాణా ఇబ్బందుల వల్ల ఓటర్లు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నందున, రాత్రి 8 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విజయ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనివల్ల క్యూ లైన్లలో ఉన్న వారందరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవడానికి వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *