Dhurandhar 2: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ రకరకాల విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. తాజాగా ఆయన ‘ధురందర్ 2’ (ధురందర్: ది రివెంజ్) సినిమాను చూసి, ఆ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మంగళవారం రాత్రి చూసినట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ‘షోలే’, ‘మొఘల్-ఎ-ఆజం’ వంటి ఆల్టైమ్ క్లాసిక్ సినిమాలు ‘ధురందర్ 2’ ముందు కేవలం టీవీ సీరియల్స్లా కనిపిస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాల కంటే ఈ చిత్రం వంద రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుందని, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో సరికొత్త మార్పులు వస్తాయని, ఇది ఒక కొత్త సినిమా శకానికి నాంది అని వర్మ అభివర్ణించారు.
దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరును వర్మ ఆకాశానికెత్తేశారు. ఇకపై ‘డైరెక్టర్’ అనే పదానికి అసలైన అర్థం ఆదిత్య ధర్ అని, ఆయన పేరుతోనే ఆ పదం మొదలవుతుందని కొనియాడారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన స్టీవెన్ స్పీల్బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి వారు కూడా తాము చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ సినిమాను చూడాలని వర్మ సూచించారు. ఈ సినిమాలోని విజువల్స్, మేకింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సాదాసీదా సినిమా రివ్యూలా కాకుండా, సినిమా ప్రపంచాన్నే మార్చేసే శక్తి ఈ చిత్రానికి ఉందని వర్మ చెప్పడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ సినిమా విడుదలయ్యాక వర్మ చెప్పినట్లుగానే అద్భుతాలు సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి.
After last nights watch of #Dhurandhar2 in terms of it’s sheer cumulative impact in every which way , whether on it’s expected collections , audience euphoria , social influences , cinematic grammar breaking , and above all the psychological audio visual impact , it will be a…
— Ram Gopal Varma (@RGVzoomin) March 18, 2026
