Submarine attack: శ్రీలంక దక్షిణ తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఇరాన్ నౌకపై జలాంతర్గామి దాడి చేయడంతో ఆ నౌక భారీ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో మొత్తం 180 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి కారణంగా దాదాపు 101 మంది గల్లంతయ్యారని, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని శ్రీలంక రక్షణ శాఖ మరియు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించాయి.
ప్రమాదానికి గురైన నౌక పేరు ‘ఐరిస్ దేనా’. నౌక మునిగిపోతున్న తరుణంలో దాని నుండి అత్యవసర సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అప్రమత్తమైంది. సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడటానికి శ్రీలంక సైన్యం పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక నౌకలను, విమానాలను రంగంలోకి దించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ పార్లమెంటులో అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, శ్రీలంక నేవీ ఇప్పటివరకు 32 మందిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చింది. గాయపడిన వారందరికీ స్థానిక ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో కలకలం సృష్టిస్తోంది.
