March New Rules: ఫిబ్రవరి 2026 ముగిసి మార్చ్ నెల ప్రారంభం కానుంది. మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ప్రతి నెలా మొదటి తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించడంతో పాటు, బ్యాంకింగ్ ఇంకా డిజిటల్ చెల్లింపుల (UPI) రంగంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆధార్ మరియు పాన్ కార్డ్ అనుసంధానానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
గ్యాస్ సిలిండర్ ధరల సమీక్ష
సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి.
- కమర్షియల్ గ్యాస్: గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ఈసారి ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది మార్చి 1 ఉదయం తేలనుంది.గత నెల కమర్షియల్ గ్యాస్ పై భారీగా ధరలు పెంచేశారు.
- డొమెస్టిక్ గ్యాస్: గృహ వినియోగదారులకు ఇచ్చే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో మార్పు ఉంటుందా లేదా అనేది సామాన్యులకు అత్యంత ఆసక్తికరమైన అంశం.
యూపీఐ (UPI) చెల్లింపుల్లో కొత్త నిబంధనలు
డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్చి నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయవచ్చు.
- ట్రాన్సాక్షన్ లిమిట్: కొన్ని రకాల వాలెట్ మరియు బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్లపై పరిమితులు లేదా అదనపు భద్రతా లేయర్లు (Two-factor authentication) పెరిగే అవకాశం ఉంది.
- ఫీజుల మార్పు: మర్చంట్ లావాదేవీలపై (P2M) ఇంటర్చేంజ్ ఫీజుల విషయంలో కొత్త అప్డేట్స్ రావచ్చు. ఇది నేరుగా వినియోగదారులపై భారం వేయకపోయినా, వ్యాపారులకు కీలకం కానుంది.
ఆధార్ – పాన్ మరియు ఇతర ఆర్థిక అంశాలు
మార్చి నెల ఆర్థిక సంవత్సరం (Financial Year) ముగింపు నెల కావడంతో, పన్ను చెల్లింపుదారులు, సామాన్యులు కొన్ని పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఆధార్ అప్డేట్: ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునే గడువు మార్చిలో ముగిసే అవకాశం ఉంది.
- బ్యాంక్ కేవైసీ (KYC): మార్చి నెలాఖరులోపు బ్యాంక్ ఖాతాలకు కేవైసీ పూర్తి చేయని వారికి లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే మార్చి ప్రారంభం నుండే బ్యాంకులు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
మార్చి 1, 2026 నుండి గ్యాస్ సిలిండర్ ధరల సవరణతో పాటు యూపీఐ లావాదేవీల్లో భద్రతా పరమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఆధార్, పాన్ మరియు బ్యాంక్ కేవైసీ వంటి పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
EPFOలో రాబోయే ముఖ్యమైన మార్పులు..
గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఉద్యోగుల నెల జీతాల నుండి పీఎఫ్ (PF) అకౌంట్లోకి డబ్బులు జమచేస్తుంది ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ). ఇంతకు ముందు ఈ డబ్బును తీసుకోవడానికి ఎంప్లాయీస్ తమకు కావాల్సిన సొమ్ము కోసం ముందుగా అప్లై చేసుకుని, అది అప్రూవ్ అయిన తర్వాతే వారి ఖాతాల్లోకి వచ్చేవి. కానీ మార్చి 2026 నుండి ఈ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఎంప్లాయీస్ నేరుగా ఏటీఎంల (ATM) నుండి లేదా యూపీఐ (UPI) యాప్ల ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురానుంది.
ఆగిపోనున్న UTS యాప్..
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది చాలా ముఖ్యమైనది. తరచుగా ప్రయాణించే వారు రైలు టికెట్ల కోసం UTS యాప్ ఉపయోగిస్తుంటారు. అయితే మార్చి 1 నుండి ఈ UTS యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ యాప్ స్థానంలో ఇకపై ‘రైల్ వన్’ (Rail One) యాప్ అందుబాటులోకి వస్తుందని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది.
