Bhatti vikramarka: దేశంలో సన్నబియమిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ

Bhatti vikramarka: పెద్దపల్లి జిల్లాలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండం ప్రాంతానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని చెప్పారు.

భట్టి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గర్వంగా అన్నారు. అదనంగా పేదలకు ఉపశమనం కల్పించడానికి ఉచిత విద్యుత్ మరియు ఉచిత బస్సు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. ఇవి లక్షలాది కుటుంబాలకు నేరుగా ఉపకారం చేస్తున్నాయని వర్ణించారు.

ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లే లక్ష్యంతో విజన్ 2047 రూపకల్పన చేశామని తెలిపారు. ఈ విజన్ ఆధారంగా అభివృద్ధి, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమై ఉన్నాయని భట్టి వెళ్ళడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *