Jammu Kashmir

Jammu Kashmir: కశ్మీర్‌లో పేలిన మందుపాతర..ఆరుగురు జవాన్లకు గాయాలు

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో మందుపాతర పేలిన ఘటనలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. నౌషేరా ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈరోజు ఉదయం ఒక సైనికుడు ప్రమాదవశాత్తూ మందుపాతర తగలడంతో పేలుడు సంభవించింది. గాయపడిన సైనికులందరినీ వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. 

మరోవైపు భద్రతా బలగాల అధికారులు మాట్లాడుతూ..

నియంత్రణ రేఖ (LoC) సమీపంలోని ఫార్వర్డ్ ప్రాంతాలు యాంటీ ఇన్‌ఫిల్ట్రేషన్ బిడ్ సిస్టమ్‌లో భాగం. కాబట్టి ఆ ప్రదేశాల్లో మందుపాతరలు పెడతారు. చొరబాట్లను నిరోధించడానికి రూపొందించబడిన ఈ గనులు కొన్నిసార్లు భారీ వర్షం కారణంగా పెట్టిన దగ్గర నుండి వేరే ప్రదేశానికి వెళుతూవుంటాయి. కొన్నిసార్లు ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించే ప్రమాదం ఉంది అని తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maha Kumbhamela 2025: మహాకుంభమేళాపై అఖిలేష్ యాదవ్ సెటైర్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *