Ponnam Prabhakar: సిటీలో 2800 ఎలక్ట్రిక్ బస్సు లను అందుబాటులోకి తీసుకువస్తామని, ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించిన్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్ లో బజాజ్ గోగో లో నూతన ఎలక్ట్రిక్ ఆటోలను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఢిల్లీ పరిస్థితి మనకు రావొద్దనే ఉద్దేశ్యంలో ఈవీ వెహికల్స్కు ప్రభుత్వం ప్రోత్సహిస్తుం దన్నారు. దేశంలోనే తొలిసారిగా అన్ని ఈవీ వాహనాలకు ఫ్రీ టాక్స్ అమలు చేస్తున్నామన్నా రు. ‘ట్రిపుల్ రింగ్ రోడ్డు లోపల ప్రతి వాహనం ఈవీ, సీఎసీజీ, ఎల్పీజీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గూడ్స్, ప్రయాణికుల వాహనాలు కూడా ఈవీ ఆటోలు వచ్చాయి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన తరువాత ఆటో వాళ్లకి ఇబ్బందులు కదులుతు న్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్ నుండి వెళ్తాయి. ఆటోలు ఇంటి దగ్గర నుండి మనం చివరి గమ్యం వరకు వస్తాయి. హైదరాబాద్ లో కొత్త ఆటోలకు పర్మిట్ ఇవ్వడం లేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే ఉన్న పాత ఆటోలకు రెట్రో ఫిటింగ్ ఇంజన్స్ ప్రయత్నం చేయండి. ప్రభుత్వం వాహన సారధి యాప్ తీ సుకువచ్చింది. స్క్రాప్ పాలసీ కూడా అమలు చేస్తున్నం.’ అని మంత్రి పొన్నం అన్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ISI కి ఇన్ఫర్మేషన్ లీక్..24 గంటల్లో భారత్ వదిలి పోవాలి..

