Telangana

Telangana: తెలంగాణలో 21మంది ఐపీఎస్‌ల బదిలీ

Telangana: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్‌ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్‌ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కల్పించారు.

1. రామగుండం సీపీగా అంబరి కిషోర్ ఝా
2. వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
3. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ
4. కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
5. నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య
6. కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
7. ఒక అడిషనల్‌ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు బదిలీ
8. ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్
9. నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
10. భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్
11. సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
12. సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
13. వరంగల్‌ డీసీపీగా అంకిత్‌ కుమార్‌
14. మంచిర్యాల డీసీపీగా భాస్కర్‌
15. పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్‌
16. సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా శిల్పవల్లి
17. సూర్యాపేట ఎస్పీగా నరసింహ
18. సీఐడీ డీజీగా ఎం.శ్రీనివాసులు
19. సీఐడీ ఎస్పీగా పి.రవీందర్‌
20. ఎస్‌ఐబీ ఎస్పీగా వై.సాయిశేఖర్‌
21. అడిషనల్‌ డీజీపీగా అనిల్‌కుమార్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *