విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు. భోపాల్‌ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్‌ రాకెట్‌ను గుర్తించారు.

ఈ ఫ్యాక్టరీలో మెఫెడ్రోన్‌ డ్రగ్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా డ్రగ్స్‌ తయారీకి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *