Karimnagar

Karimnagar: కరీంనగర్‌లో కలకలం.. మధ్యాహ్న భోజనం తిని 17 మంది విద్యార్థులకు అస్వస్థత!

Karimnagar: కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలోని ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత సుమారు 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయం తెలియగానే అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తమకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని, అలాగే అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. దీని కారణంగానే తమకు ఆరోగ్యం పాడైందని వారు తెలిపారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు, వారికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *