Maharashtra CM

Maharashtra CM: ఇంకా వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిక్కుముడి

Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 8 రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. తాత్కాలిక సీఎం ఏక్‌నాథ్ షిండే తన స్వగ్రామమైన సతారాలో రెండు రోజులు బస చేశారు. శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ముంబై నుంచి వచ్చిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు చెబుతున్నారు. ఆదివారం సతారాలోని ఓ ఆలయానికి వెళ్లిన షిండే కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ కుకీ ఉగ్రవాదుల పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే..

Maharashtra CM: ‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. బిజీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మహాయుతిలో భిన్నాభిప్రాయాలు లేవు. సీఎంపై ప్రధాని మోదీ, అమిత్ షా నిర్ణయం తీసుకుంటారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని డిసెంబర్ 2న నిర్ణయిస్తారు. అంటూ మీడియాతో షిండే చెప్పారు. హోం మంత్రిత్వ శాఖపై నెలకొన్న గొడవపై ఆయనను మీడియా ప్రశ్నించగా, షిండే సమాధానం చెప్పలేదు. ఆ తరువాత ఆయన  సతారా నుంచి ముంబై చేరుకున్నారు.

డిసెంబరు 3న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుందని సమాచారం. ఢిల్లీ నుంచి ఇద్దరు పరిశీలకులు ముంబై వచ్చి ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత అధికారికంగా సీఎంను ప్రకటిస్తారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శనివారం మాట్లాడుతూ – సీఎం బీజేపీ నుంచి, శివసేన, ఎన్సీపీల నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎం కావాలని నిర్ణయించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

One Reply to “Maharashtra CM: ఇంకా వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిక్కుముడి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *