Vijayasaireddy: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు విజయ సాయి కీలక వ్యాఖ్యలు. ఈ బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించారు. దీనిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ, ఈ ఏడాది బడ్జెట్ ‘మిడిల్ క్లాస్ బడ్జెట్’గా గుర్తుండిపోతుందని, ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ అని తెలిపారు. ఆదాయ పన్ను ఊరట, కస్టమ్స్ సుంకాలు తగ్గించడం, దృఢమైన ఆర్థిక సంస్కరణలతో కష్టించి పనిచేసే కుటుంబాలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుందని, దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు.

