Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు లోని రంగనాథం వీధిలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ పార్క్ చేసిన కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభించడంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ సంఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. మృతులను వినయ్ మరియు దిలీప్ గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: జులై 4న భారీ బహిరంగ సభ.. విజయవంతం చేయాలని పిలిపునిచ్చిన పొన్నం
కారు లోపల నాలుగు బీరు బాటిళ్లు లభించాయి. యువకులు మద్యం సేవించి, అదే కారులో నిద్రపోయిన సమయంలో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు పూర్తి సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై సాయినాథ్ చౌదరి స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

