Wayanad Landslide

Wayanad Landslide: తీవ్రమైన ప్రకృతి విపత్తుగా వాయనాడ్ విధ్వంసం

Wayanad Landslide: వాయనాడ్‌లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడిన ఘటనను కేంద్ర ప్రభుత్వం ‘తీవ్రమైన ప్రకృతి విపత్తు’గా ప్రకటించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన సహాయ ప్రక్రియను ప్రకటించింది. జూలై 30, 2024న వాయనాడ్‌లో సంభవించిన వినాశకరమైన కొండచరియలు విరిగిపడటంతో మూడు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు దాని తీవ్రత, ప్రభావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం దీనిని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా ప్రకటించింది.

కేరళ ప్రభుత్వానికి రాసిన లేఖలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇటువంటి తీవ్రమైన విపత్తులకు ఆర్థిక సహాయం మొదట్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ – SDRF అందజేస్తుందని వివరించింది.  ఇది ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ – IMCT చేసిన అంచనా తర్వాత విడుదల అయింది.  దీనికి అవసరమైన డబ్బు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి – NDRF)ద్వారా అందుతుంది. 

అయితే, వాయనాడ్ జిల్లాలోని మప్పాడి కొండచరియలు విరిగిపడిన విపత్తు తీవ్రత,  పర్యవసానాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం IMCT దీనిని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా పరిగణించిందని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం అందించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, పార్లమెంటులో ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తన హర్షాన్ని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: New Year 2025: ఆగండాగండి.. కొత్త సంవత్సరానికి మందు కిక్కుతో స్వాగతం చెబుతున్నారా? ఇది తెలుసుకోండి..

200 మందికి పైగా మరణించారు

జూలై 30న కుండపోత వర్షాల కారణంగా వాయనాడ్‌లోని చుర్మల,  ముండక్కై ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా మరణించారు. చాలా మంది గాయపడ్డారు.  వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా పరిగణించారు. 

ప్రియాంక గాంధీ సంతోషం 

కేంద్రం నిర్ణయంపై వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు వాయనాడ్‌ దుర్ఘటనను తీవ్రమైన విపత్తుగా ప్రకటించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ నేత అన్నారు. ఇది పునరావాసం అవసరమైన వారికి ఎంతో సహాయం చేస్తుంది ఖచ్చితంగా సరైన దిశలో ఒక అడుగు అని ప్రియాంక అన్నారు. 

కాగా, ఇది వాయనాడ్, కేరళ ప్రజల బలం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారు. వయనాడ్ దుర్ఘటన మనం ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన విషాదాలలో ఒకటి. కేంద్రం దీనిని తీవ్రమైన విపత్తుగా ప్రకటించాలని మేము మొదటి రోజు నుండి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.  అయితే వాయనాడ్ ప్రజల బాధలను తీర్చడానికి ప్రభుత్వానికి 5 నెలలు పట్టింది.

ALSO READ  HMPV Virus: కొత్త వైరస్ కోసం పరీక్షలు తప్పనిసరి కాదంటున్న నిపుణులు..

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *