Hyderabad: తలసాని ఇంట్లో మీటింగ్.. మేయర్ పై అవిశ్వాసం..

Hyderabad: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ లంచ్ మీటింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టే అంశం తోపాటు పలు కీలకమైన విషయాలపై చర్చ జరిగింది.

జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్‌కు ఉన్న కార్పొరేటర్ల బలం, అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్య, అలాగే అవసరమైన సభ్యులను ఎలా సమకూర్చుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో సమాలోచనలు చేశారు.

ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి, మాజీ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *