team india

Team India: టీమిండియాకు కొత్త జెర్సీ.. అదిరిపోయింది!

Team India: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం టీమిండియా కొత్త వన్డే జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జే షా, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పాల్గొన్నారు. ఈ జెర్సీని ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ వేర్ కంపెనీ అడిడాస్ తయారు చేసింది.

టీమ్ ఇండియా ప్రస్తుత  జెర్సీ పూర్తిగా నీలం రంగులో ఉంటుంది.  భుజాలపై మూడు అడిడాస్ చారలు ఉన్నాయి. ఈసారి భుజంపై ఉన్న మూడు అడిడాస్ చారలకు త్రివర్ణ పతాక ఛాయను అందించారు. ఈ జెర్సీ నీలిరంగు మునుపటి జెర్సీ కంటే కొంచెం తక్కువగా  ఉంటుంది.  అయితే దీనికి రెండు వైపులా ముదురు రంగు ఇచ్చారు. 

బీసీసీఐ కొత్త జెర్సీ వీడియోను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొత్త జెర్సీ గురించి హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, ‘నా సమక్షంలో కొత్త జెర్సీని విడుదల చేయడం నాకు గర్వకారణం. దాని లుక్స్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా భుజంపై త్రివర్ణ పతాకం ఉండడంతో ఆ ఫీలింగ్ వర్ణించలేను అని చెప్పారు. 

ఇది కూడా చదవండి: Hyderabad: 2026లో హైదరాబాద్‌లో ఖేలో ఇండియా క్రీడలు

వెస్టిండీస్‌పై కొత్త జెర్సీ తో మహిళల జట్టు

Team India: వెస్టిండీస్‌పై మహిళల జట్టు తొలిసారి కొత్త జెర్సీని ధరించనుంది. డిసెంబర్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్, వెస్టిండీస్ మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 15 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ముంబైలో జరగనున్నాయి. డిసెంబర్ 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు వడోదరలో జరగనున్నాయి.

ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే డిసెంబర్ 5న, రెండో వన్డే డిసెంబర్ 8న జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు బ్రిస్బేన్‌లో జరగనున్నాయి. మూడో మ్యాచ్ డిసెంబర్ 11న పెర్త్‌లో జరగనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *