Gautam Gambhir: హెడ్ కోచ్గా నేను కొనసాగేది లేనిది బీసీసీఐ (BCCI) నిర్ణయించాల్సిన విషయమని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. భారత క్రికెట్ నాకు ముఖ్యం, పదవి కాదన్నారు.దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత జట్టు ఓటమిపాలైన (0-2 తేడాతో వైట్వాష్) తర్వాత, హెడ్ కోచ్గా తన భవిష్యత్తు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
“హెడ్ కోచ్గా నేను కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బీసీసీఐ (BCCI) నిర్ణయించాలి. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా చెప్పాను, భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం, నేను కాదు. ఈ రోజు కూడా అదే విషయానికి కట్టుబడి ఉన్నాను.””ఈ పరాజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ఆ నింద నా నుంచే మొదలవుతుంది.” “మేము బాగా ఆడాలి. 95/1 నుంచి 122/7కి వెళ్లడం అంగీకరించలేని విషయం. ఏ ఒక్క వ్యక్తిని లేదా ఒక షాట్ను నిందించకూడదు.”
ఇది కూడా చదవండి: Sri Srinivasa Mahotsavam: కలియుగ వైకుంఠ వైభవం.. వేలాది మందితో శ్రీవారి కల్యాణం.. దద్దరిల్లిన గచ్చిబౌలి స్టేడియం
“ప్రజలు నా వైఫల్యాలను మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ, యువ జట్టుతో ఇంగ్లాండ్లో ఫలితాలు సాధించిన వ్యక్తిని నేనే. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ , ఆసియా కప్ గెలిచినప్పుడు కోచ్గా ఉన్నది కూడా నేనే.
“టెస్ట్ క్రికెట్కు అత్యంత ప్రతిభావంతులు, ఆకర్షణీయమైన ఆటగాళ్లు అవసరం లేదు. మాకు కావలసింది దృఢ సంకల్పం ఉన్న ఆటగాళ్లు . పరిమిత నైపుణ్యం ఉన్నా గట్టిగా నిలబడే వారే మంచి టెస్ట్ క్రికెటర్లు అవుతారు. అని గంభీర్ అన్నారు.

