Dogs: తాతా మనవడిని కొరికి చంపిన పెంపుడు కుక్క

Dogs ‘ టెన్నెస్సీ రాష్ట్రంలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పెంచుకున్న ఏడు పిట్‌బుల్ కుక్కలు దాడి చేయడంతో తాత, మూడు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయారు. టుల్లాహోమా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది.

 

పోలీసుల సమాచారం ప్రకారం — బాధితుడు జేమ్స్ అలెగ్జాండర్ స్మిత్ (50), అతని మూడు నెలల మనవరాలు ఇంట్లో ఉన్న సమయంలో కుటుంబానికి చెందిన పిట్ బుల్స్ ఒక్కసారిగా అట్టడుగు స్వభావంతో వారిపై దాడి చేశాయి. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకునేసరికి స్మిత్ అపస్మారక స్థితిలో ఉండగా, పసికందుపై కుక్కలు ఇంకా దాడి కొనసాగుస్తున్నాయి.

 

బాధితులను రక్షించేందుకు పోలీసులు ఆ ఏడు పిట్‌బుల్స్‌ను కాల్చి చంపాల్సి వచ్చింది. అయితే చిన్నారిని కాపాడే సమయానికి ఆలస్యమైపోయింది. ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, “ఇది అత్యంత క్రూరమైన సంఘటన. మృతుల కుటుంబం కోసం ప్రార్థించండి” అని 14వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం స్పందించింది.

 

స్థానికులు ఈ కుక్కలు గతంలోనూ హింసాత్మకంగా ప్రవర్తించేవని తెలిపారు. ఎనిమిదేళ్లుగా పెంచుకునే తన పిల్లిని కూడా ఈ పిట్‌బుల్స్ చంపేశాయని బ్రియన్ కిర్బీ అనే పొరుగువాడు వెల్లడించారు. “ఈ కుటుంబం కావాలని ఇలా జరిగేలా అనుకోలేదు. వారికి మాకంటే మరింత పెద్ద నష్టం జరిగింది” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *