Crime News:

Crime News: సంగారెడ్డి జిల్లాలో కిరాత‌కం.. యువ‌కుడి గొంతు కోసి దారుణ హ‌త్య‌

Crime News:సంగారెడ్డి జిల్లా కేంద్ర ప‌రిధిలోని ఉత్త‌ర్‌ప‌ల్లి స‌మీపంలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న సోమ‌వారం ఉద‌యం వెలుగు చూసింది. గ్రామ సమీపంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ కంపెనీ గోడౌన్‌కు కొద్ది దూరంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌త్య‌కు గురైన విష‌యాన్ని తొలుత గ్రామ‌స్థులు గుర్తించారు. ఈ మేర‌కు గ్రామ‌స్థులు పోలీసుల‌కు స‌మాచారం అంద‌జేశారు. వారిచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం వ‌చ్చి ఆధారాల‌ను సేక‌రించాయి.

Crime News:హ‌త్య‌కు గురైన వ్య‌క్తికి 30 ఏండ్ల వ‌య‌సు ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. మ‌ద్యం సీసాలు, ప‌దునైన ఆయుధంతో కిరాత‌కంగా గొంతుకోసి గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మృతుడి ఎడ‌మ వైపు ఛాతీపై ల‌త అనే పచ్చ‌బొట్టు ఉన్న‌ది. ఘ‌ట‌నా స్థ‌లాన్నిసంగారెడ్డి డీఎస్పీ స‌త్త‌య్య‌గౌడ్ ప‌రిశీలించారు. స‌మీపంలో ఉన్న‌ సీసీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, ఇత‌ర ఆధారాల‌ను సేక‌రించి త్వ‌ర‌లో వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: స్వయంగా రంగంలోకి దిగిన పవన్..భయపడుతున్న ద్వారంపూడి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *