Revanth Reddy: మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ సభలో సీఎం మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అక్కడే వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.2,747 కోట్లు నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం ఒక ఏడాదిలోనే రూ.54 వేల కోట్లు ఖర్చు చేసింది అని చెప్పారు. రైతుల కోసం ఇంకా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. ‘‘నవంబరు 29కి ఎంతో ప్రత్యేకత మైనది. సరిగా ఏడాదికి ముందు ప్రజాప్రభుత్వం కావాలి అని తెలంగాణాలో వున్నా అందరూ ఉత్సహంగా వల్ల విలువైన ఓటు వినియోగించుకొని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబయి ఇంకా హైదరాబాద్కు వలస పోయారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారు.
ఇది కూడా చదవండి: Chandrababu: బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
Revanth Reddy: గత ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా? అని ప్రేశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి ప్రజలకు బాగా తెలుసు అని. గతం లో తెలంగాణాలో వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని గత సీఎం అనలేదా అని అడిగారు. కానీ మా ప్రభుత్వంలో వరి వేస్తే రూ.500ల బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. గతంలో పంట పండితే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. మూడేళ్లు గడవకుండానే ఆ ప్రాజెక్టు కూలింది.ఈ ఏడాది కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా 1.50లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది అని అన్నారు. గత ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? అని ప్రధాని మోదీ, కేసీఆర్కు సవాల్ విసిరారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది’’ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.